Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయనంత మూర్ఖుడు లేరు? రూ.4వేల కోట్లు ఎలా ఖర్చు పెడతారో చూస్తా: జగన్

నంద్యాల ఎన్నికల్లో గెలుపొందిన తెలుగుదేశం పార్టీపై వైకాపా చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. నంద్యాల విజయం ఏ రకంగా ఏపీ సీఎం చంద్రబాబు విజయం అవుతుందో చెప్పాలన్నారు. నంద్యాల గెలుపు బాబుది కాదని.. అ

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (12:28 IST)
నంద్యాల ఎన్నికల్లో గెలుపొందిన తెలుగుదేశం పార్టీపై వైకాపా చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. నంద్యాల విజయం ఏ రకంగా ఏపీ సీఎం చంద్రబాబు విజయం అవుతుందో చెప్పాలన్నారు. నంద్యాల గెలుపు బాబుది కాదని.. అది బాబు గెలుపనుకుంటే ఆయనంత మూర్ఖుడు ఇంకెవరుండరన్నారు. పనిలో పనిగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు సవాలు విసిరారు.
 
వైకాపా నుంచి గెలుపొందిన 20 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలన్నారు. ఆ ఎన్నికల్లో రూ.4వేల కోట్లు ఎలా ఖర్చు పెడ్తారో చూస్తానన్నారు. రాజకీయాల్లో గుండె ధైర్యం వుండాలని.. ఎన్నికల్లో అవతలి వ్యక్తి ఎంత గట్టిగా కొట్టాడో....అంత గట్టిగా తీసుకోగలుగుతానో రేపటి విజయానికి నాంది అన్నారు. చంద్రబాబుకు భయపడి ప్రజలు ఓటేశారని జగన్ వ్యాఖ్యానించారు.
 
రేషన్ కార్డుల నుంచి కరెంట్ బిల్లుల వరకు ప్రజలను చంద్రబాబు మోసం చేశారని జగన్ విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావనే కారణంతోనే టీడీపీ గెలిచిందన్నారు. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments