నాన్‌స్టాప్ బస్సు సర్వీసులు : అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు

Webdunia
సోమవారం, 18 మే 2020 (17:28 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను తొలుత ప్రారంభించాలని ఉన్నతాధికారులకు సలహా ఇచ్చారు. ముఖ్యంగా, బస్సు మొదలయ్యే స్థానం నుంచి చేరుకునే స్థానం వరకు మధ్యలో ఎవరినీ ఎక్కించుకోరాదని సూంచారు. అంతేకాకుండా, బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరి వివరాలను సేకరించాలని, అలాగే, బస్సులో దిగిన తర్వాత ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. 
 
మే 18వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు లాక్డౌన్‌ను పొడగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీచేసింది. అయితే, లాక్డౌన్ నిబంధనలు సడలిస్తూ, హాట్ స్పాట్లు, కంటైన్మెంట్ జోన్ల వెలుపల బస్సులు, ఇతర వాహనాలు నడుపుకునే వెసులుబాటును కల్పించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం యంత్రాంగం తీవ్ర కసరత్తు జరుపుతోంది.
 
ఇందులోభాగంగా, సీఎం జగన్..  మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సూచనలు చేశారు. తొలుత అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులతో మొదలుపెట్టి క్రమంగా రాష్ట్రంలోనూ బస్సులు తిప్పాలని సూచించారు. ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఏపీకి చెందినవారు ఇంకా ఉన్నందున వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని, దశల వారీగా సర్వీసులు పెంచుకుంటూ పోవాలని నిర్ణయం తీసుకున్నారు.
 
ఒక నగరంలోని బస్టాండ్ నుంచి గమ్యస్థానంలోని బస్టాండ్ వరకు సర్వీసులు నడపాలని, మధ్యలో ఎవరినీ ఎక్కించుకోరాదని భావిస్తున్నారు. బస్టాండులో ప్రయాణికులు దిగిన తర్వాత కరోనా పరీక్షలు నిర్వహించాలని, బస్సు ఎక్కిన ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. 
 
ఎక్కడ ఎక్కింది, ఎక్కడికి వెళుతున్నారన్నదానిపై స్పష్టమైన వివరాలు సేకరించలని తెలిపారు. ఆపై, రాష్ట్రంలోనూ భౌతిక దూరం పాటిస్తూ బస్సు సర్వీసులు నడపాలని సూచించారు. సగం సీట్లు మాత్రమే నింపి బస్సులు నడపాలని స్పష్టం చేశారు. బస్సు సర్వీసులు నడిపేందుకు సమగ్ర రీతిలో విధివిధానాలు రూపొందించాలని నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhatti Vikramarkaఫ యువతరం ఎలా ఎదగాలనే సందేశంతో పిఠాపురంలో చిత్రం : భట్టి విక్రమార్క

చాందినీ గాయంతో కాలు నొప్పి ఉన్నా డాకూ మహారాజ్ లో పరుగెత్తే సీన్స్ చేసింది : బాబీ

Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments