మరోసారి జియో సంచలనం, రూ.4కే 1 జీబీ డేటా

Webdunia
సోమవారం, 18 మే 2020 (17:15 IST)
భారత టెలికాం రంగంలో సంచలనాలకు కేరాఫ్‌గా మారిన జియో మరోసారి అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇంటర్నెట్ డేటాను అధికంగా ఉపయోగించే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని మరో ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిన జియో, ఇప్పుడు ప్రకటించిన ప్యాకేజీ ధరను రూ.999గా నిర్ణయించింది. 
 
ఈ ప్లాన్‌లో భాగంగా వినియోగదారులకు రోజుకు 3 జీబీ చొప్పున 84 రోజులపాటు చెల్లుబాటయ్యే డేటా ప్లాన్‍‌ను అందించనుంది. అలాగే డేటాతో పాటు 100 ఎస్‌ఎంఎస్‌లు, జియో నుంచి జియో నంబర్‌లకు, జియో నుంచి ల్యాండ్‌లైన్‌ నంబర్‍‌లకు ఉచితంగా అన్‌లిమిటెడ్ వాయిస్‌కాల్స్‌ను చేసుకునే అవకాశం కల్పించింది. 
 
గతవారంలో ప్రకటించిన రూ.999 'వర్క్‌ ఫ్రం హోం' ప్లాన్‌లో రోజుకు 3 జీబీ చొప్పున 84 రోజుల పాటు డేటా వినియోగించుకునే సౌకర్యం కల్పించింది, దీంతో జియో కస్టమర్ మొత్తం 252 జీబీ డేటాను వాడుకోవచ్చు. అనగా ఈ లెక్కన 1 జీబీ డేటాకు కేవలం రూ.3.96 మాత్రమే పడుతుంది. కొత్త త్రైమాసిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ.599 మరియు రూ.555 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను కస్టమర్‌లకు 2 జీబీ మరియు 1.5 జీబీ రోజువారీ హై-స్పీడ్ డేటా ప్రయోజనాలను జియో అందిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments