ప్రతిపక్షహోదా ఇవ్వకపోయినా ప్రజా సమస్యల కోసం జగన్ సభకు వస్తున్నారు : వైవీ సుబ్బారెడ్డి

ఠాగూర్
ఆదివారం, 23 ఫిబ్రవరి 2025 (12:41 IST)
తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు వెళతారని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయ. తొలి అసెంబ్లీ సమావేశాలకు హాజరైన జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సమావేశాలకు డుమ్మా కొట్టారు. 
 
అయితే, స్పీకర్ అనుమతిలేకుండా వరుసగా 60 రోజుల పాటు సభకు హాజరుకాకుంటే ఆ సభ్యుడుపై అనర్హత వేటు పడుతుందనే నిబంధన ఉంది. దీంతో భయపడిపోయిన వైకాపాకు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇదే అంశంపై వైవీ సుబ్బారెడ్డి ఆదివారం గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం తమ పార్టీ అధినేత జగన్‌కు సరైన భద్రత కల్పించడం లేదన్నారు. వైకాపా నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. 
 
గుంటూరు మిర్చి యార్డు వెళ్ళినపుడు జగన్‌కు సరైన భద్రత కల్పించలేదని ఆరోపించారు. ఆయనకు హాని కలిగించే విధంగా వ్యవహరించారని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. జగన్ ఎక్కడికి వెళ్లినా జడ్ ప్లస్ భద్రతను కల్పించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. 
 
మరోవైపు, జగన్‌కు విపక్ష నేత హోదా ఇవ్వకుండా అవమానపరుస్తారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి కాబట్టే అసెంబ్లీకి వెళ్లాలని జగన్ నిర్ణయించారని, అనర్హత వేటుకు భయపడి అసెంబ్లీకి వెళ్లడం లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments