Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

Advertiesment
AP Assembly

సెల్వి

, శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (17:18 IST)
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 27న, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. 
 
సంకీర్ణ ప్రభుత్వం మొత్తం 15 పని దినాల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని పరిశీలిస్తోంది. అయితే, సమావేశాల మొదటి రోజున జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బిఎసి) సమావేశం తర్వాత వ్యవధిపై తుది నిర్ణయం తీసుకోబడుతుంది.
 
ఫిబ్రవరి 28న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ కార్యకలాపాలకు సన్నాహకంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రులను చర్చలకు సిద్ధంగా వుండాలని ఆదేశాలు జారీ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య... కారణాలేంటో?