Publish Date: Mon, 10 Feb 2025 (22:03 IST)
Updated Date: Mon, 10 Feb 2025 (22:04 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే జూలైలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో పూర్తి బడ్జెట్ను సమర్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా ఈ నెల 24న గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ కార్యకలాపాల్లో భాగంగా గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
సమావేశానికి ముందు, సమావేశ ఏర్పాట్లను చర్చించడానికి చీఫ్ విప్ నేతృత్వంలో మంగళవారం ప్రభుత్వ విప్లతో సమావేశం జరగనుంది. 24న గవర్నర్ ప్రసంగం తర్వాత, సమావేశాల వ్యవధిని నిర్ణయించడానికి బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బిఎసి) సమావేశమవుతుంది. ఈ నెల 28న పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.