Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభద్రతా భావంతో వణికిపోతున్న జగన్... ప్రైవేటు సైన్యం నియమించుకున్న మాజీ సీఎం!

వరుణ్
మంగళవారం, 18 జూన్ 2024 (12:23 IST)
మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారంపోయిన తర్వాత అభద్రతాభావంతో వణికిపోతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం తన ఇంటి చుట్టూత 200మందికి పైగా పోలీసులను రేయింబవుళ్లు పహారాగా ఉంచుకున్నారు. ఇపుడు ముగిసిన ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోయింది. దీంతో ముఖ్యమంత్రి పదవి ఊడింది. దీనికి తోడు వైకాపా కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడంతో ప్రధాన ప్రతిపక్ష హోదా సైతం పోయింది. ఇపుడు కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. దీంతో తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్‌ వద్ద ఉన్న పోలీసుల పహారా పూర్తిగా తొలగిపోయింది. దీంతో ఆయనకు భయం పట్టుకుంది. అభద్రతాభావంతో వణికిపోతున్నారు. ఈ సమస్య నుంచి గట్టెక్కెందేందుకు ప్రైవేట్ సైన్యాన్న నియమించుకున్నారు. తాజాగా తాడేపల్లి ప్యాలెస్‌కు భద్రతగా సుమారు 30 మంది ప్రైవేటు గార్డులను ఏర్పాటుచేసుకున్నారు. వీరంతా సఫారీ దుస్తులు ధరించి.. 'డ్యూటీ'లో చేరారు. 
 
సీఎంగా ఉన్నప్పుడు జగన్ పరదాలు, బ్యారికేడ్ల మధ్యనే తిరిగారు. పాతకాలపు తాడేపల్లిలోని మాజీ రాజుల కోటను తలపించేలా ప్యాలెస్‌ను కట్టుకున్నారు. అటు వైపు వెళ్లే దారిని మూసేశారు. నిత్యం సుమారు 200 మంది పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు.. ఇంటి వైపు ఎవరూ కన్నెత్తి చూసే అవకాశమే లేకుండా దాదాపు 30 అడుగుల ఎత్తున దుర్భేద్యమైన ఇనుప ప్రహరీని నిర్మించుకున్నారు. తనకు, తన కుటుంబ సభ్యులకు దేశ విదేశాల్లో భద్రత కల్పించేందుకు ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 
 
తీరా చూస్తే.. జగన్‌ను ప్రజలు గద్దె దించేశారు. ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా వచ్చే అవకాశంలేదు. కేవలం ఒక ఎమ్మెల్యేకు ఇచ్చే సెక్యూరిటీకి మాత్రమే ఆయన అర్హుడు. ఆయనకు అదనపు భద్రత కల్పించాలంటే... సంబంధిత కమిటీ సమీక్షించాలి. అయితే... జగన్‌కు భద్రతాపరమైన ముప్పు ఉందని నిర్ధారించాలి. రాష్ట్రంలో ఉగ్రవాదం లేదు. మావోయిస్టు తీవ్రవాదమూ లేదు. మాజీ ముఖ్యమంత్రి అనే హోదాను పక్కనపెడితే... జగన్ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేనే! అందువల్ల ఆయనకు అసాధారణమైన భద్రత కల్పించే అవకాశం అంతకంటే లేదు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ మూసివేసిన రహదారులను కొత్త ప్రభుత్వం తెరిపించింది. సామాన్యుల రాకపోకలకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రైవేటు సెక్యూరిటీని నియమించుకున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments