Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తినకు జగన్... మోడీతో భేటీ... ప్రత్యేక హోదాపై చర్చించేనా?

Webdunia
ఆదివారం, 26 మే 2019 (08:35 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న వైకాపా అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లోని తన నివాసం నుంచి ఆయన బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీకానున్నారు. 
 
అయితే, జగన్ మోహన్ రెడ్డి వెంట కేవలం ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలు మాత్రమే ఉన్నారు. అయితే, మరికొందరు నేతలు మాత్రం శనివారమే ఢిల్లీకి చేరుకుని జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 
 
కాగా, ఆదివారం ఉదయం 9 గంటలకు ఢిల్లీకి చేరుకునే జగన్.. ఉదయం 10.40 గంటలకు మోడీతో సమావేశమవుతారు. పిమ్మట ఏపీ భవన్‌కు వెళ్ళి అక్కడ ఏపీ భవన్ అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రానికి ఆయన విజయవాడకు చేరుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments