Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళిపేరుతో నమ్మించి స్నేహితులతో అత్యాచారం చేయించిన ప్రియుడు

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (08:11 IST)
ఏపీలోని సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లి చేసుకుంటానని తన ప్రియురాలిని నమ్మించి తన వెంట తీసుకెళ్ళిన ఓ కిరాతక ప్రియుడు, తనతో పాటు తన స్నేహితులతో అత్యాచారం చేయించాడు. ఈ సామూహిక ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని గోరంట్లకు చెందిన 22 యేళ్ల విద్యార్థిని తిరుపతిలోని కృష్ణతేజ ఫార్మసీ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతూ, కాలేజీ హాస్టల్‌లో ఉంటుంది. ఈమెకు గోరంట్ మండలం మల్లాపల్లికి చెందిన సాధిక్ అనే యువకుడితో ఈ విద్యార్థిని గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తన ప్రియురాలిని కలిసి సాధిక్.. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఆ యువతి అతని మాటలు నమ్మి, అతను వచ్చిన కారులో ఎక్కింది. 
 
ఆ తర్వాత మల్లాపల్లిలోని తన గదిలో ఆ యువతిని బంధించి తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ యువతిని హత్య చేసి పైకప్పుకు చున్నీతో ఉరేసుకున్నట్టుగా వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం పోలీసులకు చెప్పాడు. అయినప్పటికీ పోలీసులు సాధిక్‌ను అరెస్టు చేయకుండా యువతి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments