వివేకా హత్య కేసు : సీబీఐ విచారణకు హాజరైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (12:46 IST)
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బుధవారం హైదరాబాద్ నగరంలోని సీబీఐ కార్యాలయంలో సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టు ఆదేశం మేరకు ఆయన వద్ద ఆరు రోజుల పాటు సీబీఐ అధికారులు విచారణ జరుపనుంది. అయితే, విచారణ సందర్భంగా వీడియో, ఆడియో రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది. 
 
వివేకా హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలు ఉన్నారు. వీరిలో భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో అరెస్టు భయంతో అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనను ఈ నెల 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దంటూ ఆదేశించింది. అదేసమయంలో సీబీఐ విచారణకు హాజరుకావాలంటూ అవినాష్‌ను కోర్టు ఆదేశించింది. 
 
ఈ నేపథ్యంలో ఆయన బుధవారం ఐదోసారి ఆయన సీబీఐ విచారణకు వెళ్లారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి బయల్దేరి కోఠిలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు సీబీఐ కార్యాలయంలో ప్రతి రోజూ విచారణకు హాజరుకావాలని షరతు విధించింది. అవినాష్‌కు ప్రశ్నలను రాతపూర్వకంగా ఇవ్వాలని.. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని సీబీఐకి ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25న తుది ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments