Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వివేకా హత్య కేసు : సీబీఐ అదుపులో వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు

viveka - cbi
, శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (10:11 IST)
వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఒక అడుగు ముందుకు వేయడం.. నాలుగు అడుగులు వెనక్కి వేయడం జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుల్లో ఒకరైన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గూగుల్ టేకౌట్ ద్వారా భాస్కర్ రెడ్డి ఇంట్లో ఆయన ఉన్నట్టు గుర్తించిన సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పులివెందుల నుంచి కడప సెంట్రల్ జైల్ అతిథి గృహానికి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు. 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ విచాణరణ జరుపుతున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, వివేకా హత్య జరిగిన రోజున అవినాష్, శివశంకర్ రెడ్డిలతో పాటు ఘటనాస్థలికి ఉదయ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లినట్టు, ఆ రోజు అంబులెన్స్, ఫ్రీజర్, వైద్యులను రప్పించడంలో ఈయన కీలక పాత్ర పోషించినట్టు సీబీఐ ఓ నిర్ధారణకు వచ్చింది. వివేకా మృతదేహానికి ఉదయ్ తండ్రి జయప్రకాష్ రెడ్డి బ్యాండేజ్ కట్లు కట్టినట్టు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఉదయ్‌ను గతంలో పలుమార్లు విచారించిన విషయం తెల్సిందే.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ బాదుడే.. బాదుడు.. : ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం రూ.3,763.33 కోట్లు