Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ వల్లే నివర్ తుఫాన్ ముప్పు నుంచి తప్పించుకున్నాం: రోజా

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (16:49 IST)
నివర్ తుఫాన్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ వల్లే అతిపెద్ద తుఫాను నుంచి తప్పించుకోగాలిగామని రోజా పేర్కొన్నారు. అంతేకాదు ఇంకో రెండు తుఫాన్లు పొంచి ఉన్నాయని.. వీటి పైనే సీఎం జగన్ సమీక్ష జరుపుతున్నారని తెలిపారు. 
 
వరదల వల్ల ప్రజలు నష్టపోయారని తెలిసిన వెంటనే ఏరియల్ సర్వే చేశారని.. వరదల వల్ల నష్టపోయిన రైతులందరికీ డిసెంబర్ 31 లోగా నష్టపరిహారం వారి ఎకౌంట్లలో వేస్తారని హామీ ఇచ్చారు రోజా. వరద నష్టం పరిహారం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని చెప్పుకొచ్చారు. 
 
కాగా నివర్‌ తుఫాన్‌ ఏపీలో విధ్వంసం సృష్టించింది. తుఫాన్‌ ప్రభావంతో చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు ఉన్నాయి. తీవ్రంగా వీస్తున్న గాలులకు ఎక్కడికక్కడ చెట్లు నేలకూలాయి. 
 
నేషనల్ హైవే పైకి వర్షపు నీరు రావడంతో నెల్లూరులో ట్రాఫిక్‌ జామ్ అయింది. తుఫాను కారణంగా నెల్లూరు, చిత్తూరులో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. తిరుమలలో కనుమ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments