Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ వల్లే నివర్ తుఫాన్ ముప్పు నుంచి తప్పించుకున్నాం: రోజా

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (16:49 IST)
నివర్ తుఫాన్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ వల్లే అతిపెద్ద తుఫాను నుంచి తప్పించుకోగాలిగామని రోజా పేర్కొన్నారు. అంతేకాదు ఇంకో రెండు తుఫాన్లు పొంచి ఉన్నాయని.. వీటి పైనే సీఎం జగన్ సమీక్ష జరుపుతున్నారని తెలిపారు. 
 
వరదల వల్ల ప్రజలు నష్టపోయారని తెలిసిన వెంటనే ఏరియల్ సర్వే చేశారని.. వరదల వల్ల నష్టపోయిన రైతులందరికీ డిసెంబర్ 31 లోగా నష్టపరిహారం వారి ఎకౌంట్లలో వేస్తారని హామీ ఇచ్చారు రోజా. వరద నష్టం పరిహారం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని చెప్పుకొచ్చారు. 
 
కాగా నివర్‌ తుఫాన్‌ ఏపీలో విధ్వంసం సృష్టించింది. తుఫాన్‌ ప్రభావంతో చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు ఉన్నాయి. తీవ్రంగా వీస్తున్న గాలులకు ఎక్కడికక్కడ చెట్లు నేలకూలాయి. 
 
నేషనల్ హైవే పైకి వర్షపు నీరు రావడంతో నెల్లూరులో ట్రాఫిక్‌ జామ్ అయింది. తుఫాను కారణంగా నెల్లూరు, చిత్తూరులో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. తిరుమలలో కనుమ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments