Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో అధికారులకు సిఎం జగన్ సీరియస్ వార్నింగ్..?

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (16:46 IST)
అసలే నివర్ తుఫాన్. లక్షల ఎకరాల్లో పంట నష్టం. లేవలేని పరిస్థితుల్లో రైతులు. లబోదిబోమంటూ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో సిఎం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతి వేదికగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన అధికారులతో సమావేశమయ్యారు.
 
అంతకుముందు ఏరియల్ సర్వే ద్వారా మూడు జిల్లాల్లో వరద పరిస్థితిని స్వయంగా చూశారు. ఆ తరువాత అధికారులతో మాట్లాడారు. కానీ అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చేలా ముఖ్యమంత్రి తన ప్రసంగం సాగింది.
 
వరద బాధితులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఏ ఒక్కరు కూడా బాధపడకూడదు. ప్రభుత్వం నుంచి వారికి అన్ని విధాలుగా ఆదుకుంటాం. అయితే మీరిచ్చే నివేదిక మాత్రం కరెక్టుగా ఉండాలి. డిసెంబర్ 15వ తేదీ లోగా ఆ నివేదికను సమర్పించండి.
 
మళ్ళీ చెబుతున్నా రైతుల కన్నీళ్లను తుడిచే బాధ్యత మనదే. నేరుగా వారి అకౌంట్లలోకే డబ్బులు వేస్తున్నాం. నష్టపోయిన వారి వివరాలు ఎంత నష్టపోయారన్న విషయాన్ని స్పష్టంగా నివేదిక ఇవ్వండి అంటూ సిఎం అధికారులను ఆదేశించారు. వరద బాధితులందరికీ డిసెంబర్ 31వ తేదీలోగా ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments