Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీలో చేరేందుకు పయనమైన వైసీపీ నేత, గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (11:30 IST)
టీడీపీలో చేరేందుకు హైదరాబాదు పయనమైన వైసీపీ నేతను కొందరు గుర్తు తెలియని వ్యక్తు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డులో జరిగింది. గుంటూరు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలోని చండ్రాజు పాలేనిని చెందిన వైసీపీ నేత గాదె వెంకటరెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
 
ఇందులో భాగంగా తన అనుచరులతో కలిసి నిన్న ఉదయం హైదాబాదులోని ఎన్టీఆర్ భవన్‌కు బయలుదేరారు. ముందు ఆయన వాహనంలో వెళ్తుండగా మరో వందమంది ఆయన అనుచరులు ఎడెనిమిది వాహనాల్లో బయలు దేరారు. అయితే వారు మిర్యాలగూడ  చేరుకునేసరికి గుర్తు తెలియని వ్యక్తులు వెంకటరెడ్డిని కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. దీంతో తమ అనుచరులు ఏమీ చేయలేక వెనుదిరిగారు.
 
విషయం తెలుసుకున్న వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అయితే సాయంత్రం ఏడు గంటల సమయంలో తాను హైదరాబాదులో క్షేమంగా ఉన్నానని ఫోన్లో తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్నాళ్లుగా వైసీపీపై విరక్తి చెందిన వెంకట రెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేరనీయకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఇదంతా వైసీపీ కుట్ర అని తెలిపారు. కానీ దీనిపై కేసు నమోదు కాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

Nagarjuna : జియో హాట్ స్టార్‌లో బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష

లెక్కలో 150 మంది కార్మికులు, కానీ సెట్లో 50 మందే : చిన్న నిర్మాతల బాధలు

ఆర్మీ కుటుంబాల నేపథ్యంగా మురళీ మోహన్ తో సుప్రీమ్ వారియర్స్ ప్రారంభం

శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుంది.. : పెద్దమ్మ శ్యామలా దేవి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments