Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త నుంచి విడిపోయి రెండో పెళ్లి చేసుకున్న మహిళ.. చెట్టుకు కట్టేసి దాడి చేసిన మహిళలు (Video)

వరుణ్
గురువారం, 25 జులై 2024 (13:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో ఓ అమానుష ఘటన ఒకటి జరిగింది. ఓ మహిళ తన భర్త నుంచి విడిపోయి రెండో పెళ్లి చేసుకుంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆ గ్రామ మహిళలు పెళ్లి చేసుకున్న మహిళను చెట్టుకు కట్టేసి కోడిగుడ్లతో దాడి చేసి, కర్రలతో కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన జిల్లాలోని వీరబల్లి మండలం షికారిపాలెంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల భర్త నుంచి విడిపోయిన ఓ మహిళ.. రెండో వివాహం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ మహిళలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆమెను పట్టుకుని చెట్టుకు కట్టేశారు. ఆపై తప్పు చేసిందంటూ విచక్షణా రహితంగా ప్రవర్తించారు. కర్రలతో ఆమెను కొడుతూ, కోడిగుడ్లతో దాడి చేస్తూ ఆమెను నానా హింసకు గురిచేశారు. 
 
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ గ్రామానికి చేరుకుని బాధితురాలిని రక్షించి ఠాణాకు తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అలాగే, మహిళల దాడిలో గాయపడిన బాధితురాలిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments