Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వైసీపీలో చేరా: శైలజానాథ్

ఐవీఆర్
శనివారం, 8 ఫిబ్రవరి 2025 (09:27 IST)
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వైసీపీలో చేరానని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శైలజానాథ్ తెలియజేసారు. విజయ్ సాయిరెడ్డి షర్మిలను ఎందుకు కలిశారో తనకు తెలియదని చెప్పారు. భవిష్యత్తులో షర్మిల- జగన్ కలుస్తారో లేదో తను చెప్పలేననీ, కానీ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చంటూ వెల్లడించారు. రాష్ట్రంలో మెడికల్ సీట్లు తమకు వద్దంటూ కూటమి ప్రభుత్వం లేఖ రాయడం ఏంటని ప్రశ్నించారు. 
 
కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం నాడు చేరారు. వైకాపా అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శైలజానాథ్‌కు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. శైలజానాథ్ వైసీపీలో చేరిన సమయంలో ఆయనతో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఇతర నేతలు ఉన్నారు. 
 
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా శైలజానాథ్ గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేశారు. 2022లో ఏపీసీసీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments