Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొగుడు వద్దు.. ప్రియుడే ముద్దు : భార్య కిరాతక చర్య

Murder
Webdunia
ఆదివారం, 16 డిశెంబరు 2018 (17:25 IST)
అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త కంటే... మధ్యలో వచ్చిన ప్రియుడే ముద్దని భావించిన ఓ భార్య అత్యంత కిరాతక చర్యకు పాల్పడింది. కట్టుకున్న భర్త నుదుటిపై గొడ్డలితో నరికి హత్య చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని తొర్రూరులో జరిగిన ఈ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నెల్లికుదురు గ్రామానికి చెందిన జెల్లక వెంకన్నకు కేసముద్రంకు చెందిన సుభద్రతో 18 యేళ్ళ క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ దంపతులు కూలి పనులు చేయించుకుంటూ జీవినం సాగిస్తున్నారు. 
 
ఈ క్రమంలో అమనగల్ ప్రాంతానికి చెందిన లావుడ్యా రామ్ అలియాస్ శీను అనే వ్యక్తి వద్ద వెంకన్న కుటుంబ అవసరాల నిమిత్తం రూ.50 వేలు అప్పు తీసుకున్నాడు. దీంతో వెంకన్న ఇంటికి శీను వస్తూపోతుండేవాడు. 
 
ఈ క్రమంలో సుభద్రతో శీనుకు ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసిన వెంకన్న వారిద్దరినీ మందలించడమే కాకుండా పంచాయతీ పెద్దలతో కూడా చెప్పించాడు. అయినప్పటికీ వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.
 
ఈ క్రమంలో భర్తను వదిలించుకోవాలని ప్లాన్ వేసిన సుభద్ర... శీను, అతని స్నేహితుడు మంగిలాల్‌తో కలిసి ఈనెల 7వ తేదీన గొడ్డలితో నుదుటిపై మోది చంపేశారు. ఆ తర్వాత ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు ముగ్గురినీ హత్య చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments