Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ముఖ్యమంత్రి పీఠం ఆయనదే.. తేల్చిన ఇండియా టుడే సర్వే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే 2019లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి అధికార టీడీపీ, విపక్ష వైకాపాలు కసరత్తులు చేస్తున్నాయి. ఒకవైపు జగన్ పాదయాత్ర చేస్తుంటే ఇంకోవైపు ఏపీ ముఖ్య

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (10:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే 2019లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి అధికార టీడీపీ, విపక్ష వైకాపాలు కసరత్తులు చేస్తున్నాయి. ఒకవైపు జగన్ పాదయాత్ర చేస్తుంటే ఇంకోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో నిరంతరం ప్రజల చెంతే ఉంటున్నారు.
 
ఈనేపథ్యంలో ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా ఓ సర్వే నిర్వహించింది. ఏపీ ప్రజలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పట్టం కట్టనున్నట్లు తేలింది. చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్‌కే ప్రజామద్దతు ఎక్కువగా ఉందని ఈ సర్వే స్పష్టంచేసింది.
 
ఆంధ్రప్రదేశ్ తదుపరి సీఎం ఎవరు? అని అడిగిన ప్రశ్నకు 43 శాతం మంది వైఎస్ జగన్‌కు ఓటేయగా, మరో 38 శాతం మంది సీఎం చంద్రబాబుకు మద్దతు తెలిపారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు 5 శాతం మంది ఓటేశారు. 
 
ఈ నెల 8 నుంచి 12 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 10,650 మంది అభిప్రాయాలను సేకరించి ఈ సర్వేకు తుదిరూపు ఇచ్చారు. ఈ సర్వేలో చంద్రబాబు ప్రభుత్వం పనితీరు బాగుందని 33 శాతం మంది చెప్పగా, బాగోలేదని 36 శాతం మంది స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments