Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెసి ప్రభాకర్ రెడ్డికి కరోనావైరస్ సోకడానకి కారణం ఎవరు? సీఎంగారూ ఇది పద్ధతి కాదు: ఎవరు?

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (16:40 IST)
కక్షలు, కార్పణ్యాలు కార్ఖానాగా రాష్ట్ర ప్రభుత్వం మారిందన్న అపప్రద మీపై వస్తోందంటూ, మరో సారి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై “కరోనా” కేసు పెట్టి ఆయనకి “కరోనా” అంటించేలా చేయడం ఎంతవరకు న్యాయం అన్నారు. బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విమర్శలు చేశారు ఆయన.
 
తాడిపత్రిలో ఆ రోజు విధులు నిర్వహిస్తున్న సీఐ కూడా ఆ ప్రాంతంవాడు కాదని తెలిసింది. అందువల్ల ఆ అధికారి ఏ కులంవాడో ప్రభాకర్ రెడ్డికి ఆ క్షణంలో ఎలా తెలుస్తుంది? అని నిలదీశారు. సీఎం గారూ చట్టాలని దుర్వినియోగ పరుస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. ఇప్పటికైనా ప్రభాకర్ రెడ్డిని కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించండి, అవసరమైన ఖర్చులు ఆయనే భరిస్తారు.
 
జేసీ ప్రభాకర్రెడ్డికి ఒకవేళ ఏదైనా జరిగితే అది ప్రభుత్వ ప్రతిష్టకు మంచిది కాదు అన్నారు ఈ రెబల్ ఎంపీ. “కరోనా” కాలంలోనే ప్రభుత్వం బ్రాందీ షాపులు తెరిచింది... అధికార పార్టీ వాళ్ళు అనేక ర్యాలీలు చేశారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాత్రం కేసులు పెట్టారు. కక్షలు కార్పణ్యాలకు ముఖ్యమంత్రి దూరంగా ఉండాలని నా విజ్ఞప్తి అన్నారు రఘురామకృష్ణ రాజు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments