Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాలో గ్రాఫ్ పడిపోయిన ఆ 18 మంది ఎమ్మెల్యేలు వీరేనా? లిస్టులో మంత్రి రోజా పేరు!!!

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2023 (09:22 IST)
ఏపీలో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. అధికార వైకాపా కూడా వచ్చే ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతుంది. ఇందులోభాగంగా, ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో వర్క్‌షాప్ నిర్వహిస్తూ వారి పనితీరును ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తున్నారు. 
 
తాజాగా నిర్వహించిన వర్క్‌షాపులో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. పనితీరు మెరుగుపరుచుకోలేని వారికి టిక్కెట్ ఇవ్వలేనని తెగేసి చెప్పారు. ముఖ్యంగా 18 మంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగోలేదని, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాకుంటే వారు తనను నిందించవద్దని ముఖాన్నే చెప్పేశారు. ఆ 18 మందిని తాను వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడుతానని తెలిపారు. అయితే, ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరన్నది ఇపుడు చర్చనీయాశంగా మారింది. మరోవైపు ఆ 18 మంది ఎమ్మెల్యేలు వీరేనంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
జగన్ అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది "గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం"లో పాల్గొనలేని వారే ఉన్నారని, వీరిలో పినిపె విశ్వరూప్, గుడివాడ అమర్నాథ్, కొట్టు సత్యనారాయణ, జోగి రమేశ్, తానేటి వనిత, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్, అవంతి శ్రీనివాస్, కొడాలి నాని, మేకతోటి సుచరిత, పాముల పుష్ప శ్రీవాణి, కారుమూరి నాగేశ్వరరావు, బాలినేని శ్రీనివాసరెడ్డి, వసంత కృష్ణ ప్రసాద్, కోలగట్ల వీరభద్ర స్వామి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, రెడ్డి శాంతి, గ్రంథి శ్రీనివాసరావులు ఉన్నట్టు పెద్ద ప్రచారమే సాగుతోంది. అయితే, ఈ జాబితా నిజమో కాదో సీఎం జగన్ అధికారికంగా స్పష్టం చేయాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments