Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు వేయాలన్న గ్రామ ప్రజలు... లాఠీలతో చితకబాదిన పోలీసులు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (07:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల ఊబిలో కూరుకునిపోయింది. నిధులు లేకపోవడంతో ఒక్కటంటే ఒక్క రోడ్డును కూడా బాగు చేయలేని దుస్థితి నెలకొంది. అదేసమయంలో అనేక గ్రామాలకు చెందిన ప్రజలు తమకు రోడ్డు వేయాలంటూ కోరుతున్నారు. శాంతియుతంగా ర్యాలీలు చేస్తున్నారు. ఇలాంటి వారిపై అధికార పార్టీ నేతలు, అధికారులు ప్రోద్బలంతో పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. 
 
తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం అడవికొలను గ్రామానికి రహదారి నిర్మించాలంటూ గ్రామస్థులు ఆదివారం సాయంత్రం పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను నిడమర్రు పోలీసులు అడ్డుకున్నారు. లాఠీలకు పనిచెప్పి పాదయాత్ర చేస్తున్నవారిని చెదరగొట్టారు. 
 
పలువురిని అరెస్టు చేసి నిడమర్రు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై అడవికొలను గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి రోడ్డు వేయాలని శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే.. పోలీసులు లాఠీలతో చితకబాదడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments