Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తుత్తి ఉరి కాస్త నిజమైంది.. భార్యను బెదిరించబోయిన భర్త మృతి

Webdunia
మంగళవారం, 5 మే 2020 (09:26 IST)
భార్యను బెదిరించబోయిన ఓ భర్త తన ప్రాణాలను కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వెస్ట్ గోదావరి జిల్లా, తాళ్ళపూడి మండలం, మలకపల్లికి చెందిన జి.గణేష్ (35) అనే వ్యక్తి భార్య ఐదు నెలల క్రితం అంటే జనవరిలో కువైట్‌కు వెళ్లింది. ఆ తర్వాత కరోనా వైరస్ వ్యాపించింది. దీంతో అనేక ప్రభుత్వాలు విదేశీ కార్మికులను తమతమ దేశాలకు తరలి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించాయి. కానీ, గణేష్ భార్య మాత్రం అవేమీ పట్టించుకోకుండా అక్కడే ఉండిపోయింది.
 
ఇది భర్తకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తక్షణం తన భార్యను స్వదేశానికి రప్పించే ప్రయత్నం చేశాడు. ఇందులోభాగంగా, ఆయన భార్యను బెదిరించేందుకు ఉరి నాటకమాడారు. అయితే, ఆ ఉత్తుత్తి ఉరి కాస్త నిజమైంది. మెడకు బిగించుకున్న ఉరి కాస్త ప్రమాదవశాత్తు మెడకు బిగించుకుని ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ మొత్తం ఘటనను ఆయన సెల్‌ఫోనులో చిత్రీకరించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments