Webdunia - Bharat's app for daily news and videos

Install App

పత్రికలను తిడితేనో, నన్ను తిడితేనో భయపడం: దేవినేని ఉమా

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (19:28 IST)
కృష్ణా జిల్లా పురగుట్టలో టీడీపీ ఇచ్చిన పట్టాలను రద్దు చేసే అధికారం ఎవరిచ్చారని మాజీ మంత్రి, టీడీపీ అధికార ప్రతినిధి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.

బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పట్టాలు పొందిన పేదల ఉసురు ప్రభుత్వంకు తగులుతుందని హెచ్చరించారు. చంద్రబాబు హయాంలో ఏర్పడిన లే అవుట్‌కు సిగ్గు శరం లేకుండా వైసీపీ పేర్లు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు.

మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావడమే పురగుట్ట పేరు మార్చి ఎన్ టీ ఆర్ పేరు పెట్టి పట్టాలు ఇస్తామని స్పష్టం చేశారు. అయ్యప్ప మాలలో ఉండి ఎమ్మెల్యే వసంత అసత్యాలు, అబద్దాలు మాట్లాడుతున్నాడన్నారు.

‘‘పత్రికలను తిడితేనో, నన్ను తిడితే నో నీకు భయపడం’’ అని ఉమా తెలిపారు. రైతు సమస్య తీర్చమని వస్తే నాయకుడితో దాడి చేయించడం దారుణమన్నారు. రైతు లపై దాడులు చేయడమేనా రాజన్న రాజ్యం అని నిలదీశారు.

వైసీపీ నాయకుల దాడులకు కొంతమంది గ్రామాలు వదిలి వెళ్లిపోయారని చెప్పారు. అవినీతి చేస్తే రాజీనామా చేస్తానన్నావుగా చెయ్ అని దేవినేని సవాల్ విసిరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah Bhatia- తమన్నా భాటియా విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసిందా?

తలసేమియా భాదితుల కోసం తమన్ మ్యూజికల్ నైట్ : నారా భువనేశ్వరి

సిద్ధార్థ్, శ్రీ గణేష్, శరత్‌కుమార్, దేవయాని మూవీ టైటిల్ 3 BHK

బాలకృష్ణ గారు నాకు సపోర్ట్ చేయడాన్ని గొళ్ళెం వేయకండి : విశ్వక్ సేన్

తెలుగు సినిమా పుట్టిన రోజుగా కీలక నిర్ణయాలు తీసుకున్న ఫిల్మ్ చాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments