Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేము ఏ పార్టీకి అనుకూలంగా లేము : ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

Webdunia
గురువారం, 30 జులై 2020 (16:40 IST)
అమరావతి పరిరక్షణ సమితి వేసిన పిటిషన్ లో తమనూ ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసి సర్వత్రా విమర్శల పాలైన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిఫెన్స్ లో పడిపోయారు.

తను పిటిషన్ వేయడానికి గల కారణంపై వివరణ ఇచ్చుకున్నారు. ఉద్యోగులకు, రాజకీయాలకు సంబంధం లేదని, తాము ఏ పార్టీకి అనుకూలంగా లేమని చెప్పారు.

రాజధాని బిల్లు పాసైతే కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని, అది కూడా విద్యా సంవత్సరంలో ఇబ్బందులు లేకుండా చూడాలని, ఎవరిని తక్షణం రావాలని ఇబ్బందులు పెట్టొద్దని కూడా విజ్ఞప్తి చేశామని వెంకట్రామిరెడ్డి గుర్తుచేశారు.

రాజధాని తరలింపు కోసం రూ.5 వేలు కోట్లు అవుతున్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగుల సంఘం అంతర్గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో హైకోర్టులో పిటిషన్లు వేశారని, ఉద్యోగులను అనవసరంగా హైకోర్టు పిటిషన్‌లో చొప్పించారని విమర్శించారు.

అందుకే ఉద్యోగులుగా హైకోర్టు పిటిషన్‌లో ఇంప్లీడ్ అయ్యామని తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి వేసిన పిటిషన్‌కు వాస్తవాలతో కూడిన సమాధానం కోర్టుకు చెప్పామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments