Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో బాలింత మృతి.. స్తన్యమిచ్చి పడుకుంది.. అంతే..

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2023 (09:44 IST)
గుండెపోటుతో మృతి చెందే వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో అధికమవుతోంది. తాజాగా ఓ బాలింత గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. వరంగల్  సీకేఎం ప్రభుత్వాసుపత్రిలో ఘోరం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే, వర్ధన్నపేట మండలం ఇల్లందు గ్రామానికి చెందిన సుస్మిత(25) ప్రసవం కోసం ఈ నెల 13న సీకేఎం ఆసుపత్రిలో చేరింది. 16న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 
 
అయితే శిశువుకు అనారోగ్య సమస్యలు రావడంతో వైద్యులు ఆస్పత్రిలోనే నవజాత శిశుసంరక్షణ కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎప్పటిలాగే తన బిడ్డకు ప్రత్యేక వార్డులో స్తన్యమిచ్చి వచ్చి తన బెడ్‌పై పడుకుంది. కానీ, ఉదయం చాలాసేపైనా ఆమె చలనం లేకుండా పడుకుని ఉండటంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. సుస్మితను నిద్రలేపేందుకు ప్రయత్నించగా ఆమెలో కదలికలు కనిపించలేదు.  
 
విషయం తెలిసి ఆమెను పరీక్షించిన వైద్యులు సుస్మితకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించినట్లు ధ్రువీకరించారు. ఆమెకు సీపీఆర్ చేసిన ఫలితం లేకపోయింది. సుస్మిత మరణంతో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నవజాత శిశువును చూస్తూ.. తల్లిని లేని బిడ్డగా మారిపోయావంటూ వారి రోదనలు ఆస్పత్రిలోని వారంతటిని కలిచివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments