Webdunia - Bharat's app for daily news and videos

Install App

కురుపాంలో ఇద్దరు ఇంటర్ బాలికలపై అత్యాచారం

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (11:19 IST)
విజయనగరం జిల్లా కురుపాంలో ఇద్దరు మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. కొత్త సంవత్సర వేడుకలను జరుపుకుని కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఇద్దరు బాలికలను ఓ దండగుడు అడ్డగించి పోలీసునని బెదిరించి అత్యాచారానికి తెగబడ్డాడు. దీనిపై బాధిత విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని జియ్యమ్మవలస మండలానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు కురుపాంలోని పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో ఉంటూ ఇంటర్ చదువుతున్నారు. వీరిద్దరూ శనివారం మధ్యాహ్నం హాస్టల్ నుంచి బయటకు వచ్చిన రేగటి గ్రామానికి వెళ్లారు. అక్కడ కొత్త సంవత్సర వేడుకులను జరుపుకుని అక్కడి నుంచి తమ తమ ఇళ్లకు బయలుదేరారు. 
 
అయితే, మార్గమధ్యంలో రావాడ డ్యాం వద్ద రౌడీ షీటర్ రాంబాబు వారిని అడ్డగించి, పోలీసునని బెదిరించాడు. తాను చెప్పినట్టు వినకుంటే అరెస్టు చేస్తానని బెదిరించాడు. దీంతో వారిద్దరూ భయంతో వణికిపోయారు. తర్వాత ఒకరి తర్వాత ఒకరిపై లైంగికదాడికి తెగబడ్డాడు. ఆ తర్వాత వారిద్దరిని వదిలివేసి పారిపోయాడు. దీనిపై బాధిత బాలికలు తమ కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. రౌడీషీటర్ కోసం గాలిస్తున్నారు. బాలికలకు వైద్య పరీక్షలు చేయించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments