Webdunia - Bharat's app for daily news and videos

Install App

కురుపాంలో ఇద్దరు ఇంటర్ బాలికలపై అత్యాచారం

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (11:19 IST)
విజయనగరం జిల్లా కురుపాంలో ఇద్దరు మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. కొత్త సంవత్సర వేడుకలను జరుపుకుని కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఇద్దరు బాలికలను ఓ దండగుడు అడ్డగించి పోలీసునని బెదిరించి అత్యాచారానికి తెగబడ్డాడు. దీనిపై బాధిత విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని జియ్యమ్మవలస మండలానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు కురుపాంలోని పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో ఉంటూ ఇంటర్ చదువుతున్నారు. వీరిద్దరూ శనివారం మధ్యాహ్నం హాస్టల్ నుంచి బయటకు వచ్చిన రేగటి గ్రామానికి వెళ్లారు. అక్కడ కొత్త సంవత్సర వేడుకులను జరుపుకుని అక్కడి నుంచి తమ తమ ఇళ్లకు బయలుదేరారు. 
 
అయితే, మార్గమధ్యంలో రావాడ డ్యాం వద్ద రౌడీ షీటర్ రాంబాబు వారిని అడ్డగించి, పోలీసునని బెదిరించాడు. తాను చెప్పినట్టు వినకుంటే అరెస్టు చేస్తానని బెదిరించాడు. దీంతో వారిద్దరూ భయంతో వణికిపోయారు. తర్వాత ఒకరి తర్వాత ఒకరిపై లైంగికదాడికి తెగబడ్డాడు. ఆ తర్వాత వారిద్దరిని వదిలివేసి పారిపోయాడు. దీనిపై బాధిత బాలికలు తమ కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. రౌడీషీటర్ కోసం గాలిస్తున్నారు. బాలికలకు వైద్య పరీక్షలు చేయించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments