Webdunia - Bharat's app for daily news and videos

Install App

కురుపాంలో ఇద్దరు ఇంటర్ బాలికలపై అత్యాచారం

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (11:19 IST)
విజయనగరం జిల్లా కురుపాంలో ఇద్దరు మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. కొత్త సంవత్సర వేడుకలను జరుపుకుని కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఇద్దరు బాలికలను ఓ దండగుడు అడ్డగించి పోలీసునని బెదిరించి అత్యాచారానికి తెగబడ్డాడు. దీనిపై బాధిత విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని జియ్యమ్మవలస మండలానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు కురుపాంలోని పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో ఉంటూ ఇంటర్ చదువుతున్నారు. వీరిద్దరూ శనివారం మధ్యాహ్నం హాస్టల్ నుంచి బయటకు వచ్చిన రేగటి గ్రామానికి వెళ్లారు. అక్కడ కొత్త సంవత్సర వేడుకులను జరుపుకుని అక్కడి నుంచి తమ తమ ఇళ్లకు బయలుదేరారు. 
 
అయితే, మార్గమధ్యంలో రావాడ డ్యాం వద్ద రౌడీ షీటర్ రాంబాబు వారిని అడ్డగించి, పోలీసునని బెదిరించాడు. తాను చెప్పినట్టు వినకుంటే అరెస్టు చేస్తానని బెదిరించాడు. దీంతో వారిద్దరూ భయంతో వణికిపోయారు. తర్వాత ఒకరి తర్వాత ఒకరిపై లైంగికదాడికి తెగబడ్డాడు. ఆ తర్వాత వారిద్దరిని వదిలివేసి పారిపోయాడు. దీనిపై బాధిత బాలికలు తమ కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. రౌడీషీటర్ కోసం గాలిస్తున్నారు. బాలికలకు వైద్య పరీక్షలు చేయించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments