Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడకసుఖం కోసం ప్రియుడితో కలిసి భర్త హత్య...

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (11:35 IST)
ప్రియుడితో పడకసుఖం పంచుకునేందుకు కట్టుకున్న భర్తనే కడతేర్చిందో కసాయి భార్య. హత్య జరిగిన 23 రోజులకు ఈ విషయం వెలుగు చూసింది. ఈ దారుణం విశాఖపట్టణం జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖ జిల్లా మద్దిలపాలేనికి చెందిన దల్లి జ్యోతి (26)కి సతీశ్ అనే వ్యక్తితో వివాహమైంది. సతీశ్ సైన్యంలో హవల్దార్‌గా పనిచేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో గత నెల 19వ తేదీన పోలీసులకు ఫోన్ చేసిన జ్యోతి తన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటూ బోరున విలపిస్తూ సమాచారం ఇచ్చింది. పైగా, సతీశ్ ఆత్మహత్యపై కూడా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అనుమానం లేదా సందేహం వ్యక్తం చేయలేదు. దీంతో సతీశ్ నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడనీ పోలీసులతో పాటు... కుటుంబ సభ్యులు కూడా భావించారు. ఆ తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, అంత్యక్రియలు పూర్తిచేశారు.
 
అదేసమయంలో సైనికాధికారులను కలిసిన జ్యోతి.. తన భర్తకు రావాల్సిన నగదు, ఇతర బత్యాలను చెల్లించాలని డిమాండ్ చేయసాగింది. దీంతో అనుమానం వచ్చిన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. వారు జ్యోతిని మరోమారు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 
సిమ్మా భరత్ కుమార్ (24) అనే యువకుడితో 9 నెలల క్రితం జ్యోతికి పరిచయం ఏర్పడింది. అది క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇటీవల సెలవులపై ఇంటికి వచ్చిన భర్త సతీశ్ కుమార్‌కు విషయం తెలిసి భార్యను హెచ్చరించాడు. దీంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది.
 
గత నెల 18న భర్త తాగుతున్న మద్యంలో నిద్రమాత్రలు కలిపేసింది. దీంతో మద్యం తాగిన అనంతరం సతీశ్ మత్తులోకి జారుకున్నాడు. ప్లాన్‌లో భాగంగా ముందుగానే అక్కడికి చేరుకున్న ప్రియుడు భరత్, కొత్తరేసపువానిపాలేనికి చెందిన గొడ్ల భాస్కర్ (22)లు ఇంట్లోకి చొరబడి చున్నీతో సతీశ్‌ మెడకు ఉరి బిగించి హత్య చేసినట్టు అంగీకరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments