Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్య ఫోన్ లిఫ్ట్ చేయలేదని రెండేళ్ళ కూతురికి విషమిచ్చి చంపేసిన తండ్రి..

భార్య ఫోన్ లిఫ్ట్ చేయలేదని రెండేళ్ళ కూతురికి విషమిచ్చి చంపేసిన తండ్రి..
, బుధవారం, 4 సెప్టెంబరు 2019 (16:52 IST)
కుటుంబమన్న తరువాత గొడవలు షరా మామూలే. పెళ్ళి చేసుకున్న తరువాత రకరకాల సమస్యలు వస్తుంటాయి.. సర్దుకుపొమ్మని పెద్దలు చెబుతుంటారు. కానీ చిత్తూరు జిల్లాలో మాత్రం ఒక వ్యక్తి తన భార్య ఫోన్ లిఫ్ట్ చేయలేదన్న చిన్న కారణంతో అభంశుభం తెలియని రెండేళ్ళ చిన్నారిని అతి దారుణంగా విషమిచ్చి చంపేశాడు.
 
చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం రామాపురంకు చెందిన ఆదేశ్వర్, నందినీలకు నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరిది ప్రేమ వివాహమే. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే గత రెండు నెలల నుంచి ఆర్థిక సమస్యల కారణంగా తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే గత రెండురోజుల క్రితం భర్తతో గొడవ వేసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది నందిని.
 
తన పెద్దకూతురిని తీసుకుని.. చిన్న కూతురిని ఇంట్లోనే వదిలి వెళ్ళిపోయింది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు తన భార్యకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఆదేశ్వర్. అయితే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య ఫోన్ తీయకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు ఆదేశ్వర్. ఇంట్లో పురుగులు మందు రెండేళ్ళ కుమార్తెకు తాగించాడు. ఆ చిన్నారి చనిపోయిన తరువాత తాను కూడా ఆ పురుగుల మందు తాగాడు.
 
అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. స్థానికులు గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆదేశ్వర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హారీష్ రావు ముఖ్యమంత్రి కావాలని 1016 కొబ్బరికాయలు కొట్టాడు...