Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ జీపుకు ప్రమాదం : విశాఖపట్టణంలో సీఐ మృతి

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (08:10 IST)
ఓ గుర్తు తెలియని వాహనాన్ని పోలీసు జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన విశాఖపట్టణం జిల్లాలోని ఎండాడ వద్ద జాతీయ రహదారిపై జరిగింది. 
 
సీఐ ఈశ్వరీరావు, మరో కానిస్టేబుల్ రాత్రివేళ విధులు ముగించుకుని స్టేషన్‌కు బయలుదేరారు. ఆ సమయంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనాన్ని పోలీసు జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోలీసు జీపు ముందుగా బాగా దెబ్బతింది. దీంతో సీఐ అక్కడికక్కడే మృతి చెందగా, కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాద స్థలికి చేరుకుని గాయపడిన కానిస్టేబుల్‌ను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో జిరగింది. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పోలీసులు గాలిస్తున్నారు. ఇందుకోసం జాతీయ రహదారిపై అమర్చిన సీసీ టీవీ కెమెరా ఫుటేజీలను నిశితంగా విశ్లేషిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments