Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ జీపుకు ప్రమాదం : విశాఖపట్టణంలో సీఐ మృతి

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (08:10 IST)
ఓ గుర్తు తెలియని వాహనాన్ని పోలీసు జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన విశాఖపట్టణం జిల్లాలోని ఎండాడ వద్ద జాతీయ రహదారిపై జరిగింది. 
 
సీఐ ఈశ్వరీరావు, మరో కానిస్టేబుల్ రాత్రివేళ విధులు ముగించుకుని స్టేషన్‌కు బయలుదేరారు. ఆ సమయంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనాన్ని పోలీసు జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోలీసు జీపు ముందుగా బాగా దెబ్బతింది. దీంతో సీఐ అక్కడికక్కడే మృతి చెందగా, కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాద స్థలికి చేరుకుని గాయపడిన కానిస్టేబుల్‌ను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో జిరగింది. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పోలీసులు గాలిస్తున్నారు. ఇందుకోసం జాతీయ రహదారిపై అమర్చిన సీసీ టీవీ కెమెరా ఫుటేజీలను నిశితంగా విశ్లేషిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మినిమం ఓపెనింగ్‌ను రాబట్టుకోలేకపోతున్న టాలీవుడ్ హీరోలు!!

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments