Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ఉచ్చులో చిక్కిన చంద్రబాబు : బీజేపీ ఎంపీ హరిబాబు

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పన్నిన ఉచ్చులో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిక్కారని బీజేపీ ఎంపీ కె.హరిబాబు ఆరోపించారు. ప్రధాని మోడీ సర్కారుకు వ్యతిరేకంగా టీడీపీ అవిశ్వాస తీర్

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (11:26 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పన్నిన ఉచ్చులో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిక్కారని బీజేపీ ఎంపీ కె.హరిబాబు ఆరోపించారు. ప్రధాని మోడీ సర్కారుకు వ్యతిరేకంగా టీడీపీ అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడంపై హరిబాబు స్పందిస్తూ, ప్రత్యేకహోదా పేరుతో భాజపా, తెలుగుదేశం పార్టీల మధ్య చిచ్చుపెట్టి రెండింటినీ విడగొట్టాలని జగన్‌ పన్నిన ఉచ్చులో చంద్రబాబు చిక్కారన్నారు. 
 
తాజాగా రాజకీయ పరిణామాలపై ఆయన స్పందిస్తూ, 'పవన్‌కల్యాణ్‌, జగన్‌ను భాజపానే నడిస్తోందన్న ఆరోపణలు వాస్తవంకాదు. కాకినాడ సభలో పవన్‌ భాజపాను తీవ్రంగా విమర్శించినప్పుడు ఎవ్వరూ దాని గురించి మాట్లాడలేదు. ఈరోజు అదే వ్యక్తితో భాజపాకు ముడిపెట్టడం ఆశ్చర్యకరం. 2014 ఎన్నికల్లో భాజపా, తెదేపా కలవడంవల్లే వైకాపా ఓడిపోయింది కాబట్టి హోదా అంశాన్ని తెరమీదికి తెచ్చి రెండు పార్టీలు విడిపోయేలా జగన్‌ చేశారు. ఎన్డీయే నుంచి తెలుగుదేశం వైదొలగడం, కేంద్రం ఏమీ చేయలేదనడం అన్యాయం. పవన్‌, జగన్‌లు మోడీని విమర్శించడంలేదని తెదేపా చెప్పడం ఆశ్చర్యకరం. వారిద్దరూ మోడీని తిడుతుంటే ఆనందించాలనుకుంటున్నారా? అని హరిబాబు ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments