Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ ఘటనపై కేటీఆర్ షాక్.. ఎక్కువగా పీల్చేయడంతోనే ఇబ్బంది?

Webdunia
గురువారం, 7 మే 2020 (10:45 IST)
వైజాగ్ ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. అయితే విష వాయువును పీల్చడం కారణంగా ఆరుగురు చనిపోయారని డీజీపీ వెల్లడించారు. మరో ఇద్దరు ఈ సమస్య నుంచి తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు మరణించారని తెలిపారు.
 
అయితే ఈ గ్యాసేమీ ప్రాణాంతకం కాదని.. దీని కారణంగా అనారోగ్యానికి గురైన వారంతా వెంటనే డిశ్చార్జ్ అవుతారని భావిస్తున్నామన్నారు. అయితే సమస్యంతా ఈ గ్యాస్‌ని ఎక్కువ మొత్తం పీల్చినవారితోనేనని డీజీపీ తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో పని చేసే వర్కర్స్ అంతా ఆ పరిసరాల్లోనే ఉంటారని.. వారికి ఇది మరింత ప్రమాదకరమన్నారు.
 
మరోవైపు విశాఖపట్నంలోని విషవాయువు లీక్ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ షాక్‌ అయ్యారు. ఈ మేరకు ఈ ఘటనపై ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అందరూ తొందరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే మృతుల కుటుంబాలకు కేటీఆర్ సానుభూతి వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments