Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు దర్యాప్తులో జాప్యమేల? సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (18:38 IST)
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్య కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న రాంసింగ్‌ను విచారణాధికారి బాధ్యతల నుంచి తప్పించి మరో అధికారిని నియమించాలని నిందితుడు శివశంకర్ రెడ్డి బార్య తులసమ్మ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. 
 
ఈ సందర్భంగా దర్యాప్తులో తీవ్ర జాప్యం నెలకొనడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్య కేసు దర్యాప్తును ఎందుకు పూర్తి చేయడం లేదని.. ఎందుకు ఆలస్యం చేస్తున్నారని విచారణ సందర్భంగా దర్యాప్తు అధికారిని ధర్మాసనం ప్రశ్నించింది. కేసు విచారణ త్వరగా ముగించకుంటే మరో అధికారిని ఎందుకు నియమించకూడదని కోర్టు ప్రశ్నించింది. 
 
వేరొకరిని నియమించడంపై సీబీఐ డైరెక్టర్‌ అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. కేసు విచారణ పురోగతి, తాజా పరిస్థితిపై సీల్డ్‌ కవర్‌లో నివేదిక సమర్పించాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. దర్యాప్తు అధికారి సక్రమంగానే విచారణ చేస్తున్నారని సీబీఐ తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నటరాజన్‌ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం