Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ : నా భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు : భార్య పటిషన్

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (17:17 IST)
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు రాజశేఖర్‌పై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారంటూ ఆయన భార్య సుచరిత ఆరోపించారు. అందువల్ల తన భర్తకు పరీక్షలు చేయించాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజశేఖర్‌ రెడ్డిని కస్టడీకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు చేయించామని పోలీసు శాఖ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 
 
కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో హాజరుపరిచే ముందు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కోర్టుకు వివరించారు. కస్టడీకి ఇచ్చే ముందు నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకే విచారణ జరుగుతుందన్నారు. ఈ వాదనలు ఆలకించిన హైకోర్టు.. పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ విషయంలో ఇంకేమైనా సమస్యలుంటే నాంపల్లి కోర్టును ఆశ్రయించాల్సిందిగా పిటిషనర్‌కు ఉన్నత న్యాయస్థానం సూచించింది.
 
మరోవైపు టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ఉస్మానియా జేఏసీ ఆందోళనకు దిగింది. గ్రూప్‌-1 తర్వాత జరిగిన చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (సీడీపీవో) పరీక్ష కూడా రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. గ్రూప్‌-1 తర్వాత జరిగిన ఈ పరీక్షను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించింది. సీడీపీవో పేపర్‌ కూడా లీకేజీ అయ్యిందని ఓయూ జేఏసీ నాయకులు అనుమానం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments