Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు : సీబీఐ అదుపులో వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (10:11 IST)
వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఒక అడుగు ముందుకు వేయడం.. నాలుగు అడుగులు వెనక్కి వేయడం జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుల్లో ఒకరైన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గూగుల్ టేకౌట్ ద్వారా భాస్కర్ రెడ్డి ఇంట్లో ఆయన ఉన్నట్టు గుర్తించిన సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పులివెందుల నుంచి కడప సెంట్రల్ జైల్ అతిథి గృహానికి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు. 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ విచాణరణ జరుపుతున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, వివేకా హత్య జరిగిన రోజున అవినాష్, శివశంకర్ రెడ్డిలతో పాటు ఘటనాస్థలికి ఉదయ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లినట్టు, ఆ రోజు అంబులెన్స్, ఫ్రీజర్, వైద్యులను రప్పించడంలో ఈయన కీలక పాత్ర పోషించినట్టు సీబీఐ ఓ నిర్ధారణకు వచ్చింది. వివేకా మృతదేహానికి ఉదయ్ తండ్రి జయప్రకాష్ రెడ్డి బ్యాండేజ్ కట్లు కట్టినట్టు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఉదయ్‌ను గతంలో పలుమార్లు విచారించిన విషయం తెల్సిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను నా వైఫ్ ఫ్రెండ్‌కి సైట్ కొడితే నాకు నా భార్య పడింది: అనిల్ రావిపూడి

నన్ను చాలా టార్చర్ చేశాడు.. అందుకే జానీ మాస్టర్‌పై కేసు పెట్టాను.. బన్నీకి సంబంధం లేదు.. సృష్టి వర్మ (video)

ఐటీ సోదాల ఎఫెక్ట్.. 'సంక్రాంతికి వస్తున్నాం' వసూళ్లు ఎంతో తెలుసా?

కన్నప్ప నుంచి త్రిశూలం, నుదుట విబూదితో ప్రభాస్ చూపులు లుక్

తల్లి మనసు కి వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలి:ఆర్.నారాయణమూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments