Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసు : సీబీఐ అదుపులో వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (10:11 IST)
వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఒక అడుగు ముందుకు వేయడం.. నాలుగు అడుగులు వెనక్కి వేయడం జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుల్లో ఒకరైన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గూగుల్ టేకౌట్ ద్వారా భాస్కర్ రెడ్డి ఇంట్లో ఆయన ఉన్నట్టు గుర్తించిన సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పులివెందుల నుంచి కడప సెంట్రల్ జైల్ అతిథి గృహానికి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు. 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ విచాణరణ జరుపుతున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, వివేకా హత్య జరిగిన రోజున అవినాష్, శివశంకర్ రెడ్డిలతో పాటు ఘటనాస్థలికి ఉదయ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లినట్టు, ఆ రోజు అంబులెన్స్, ఫ్రీజర్, వైద్యులను రప్పించడంలో ఈయన కీలక పాత్ర పోషించినట్టు సీబీఐ ఓ నిర్ధారణకు వచ్చింది. వివేకా మృతదేహానికి ఉదయ్ తండ్రి జయప్రకాష్ రెడ్డి బ్యాండేజ్ కట్లు కట్టినట్టు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఉదయ్‌ను గతంలో పలుమార్లు విచారించిన విషయం తెల్సిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments