Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్కంఠను రేపుతున్న అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (19:28 IST)
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ ఉత్కంఠ రేపుతోంది. ఈ నెల 25 తేదీనే విచారణ చేపట్టాల్సివుండగా, న్యాయమూర్తి 26వ తేదీ బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం కూడా విచారణ చేపట్టారు. ఈ రోజు జాబితాలో లేదని, అందువల్ల రేపు విచారిస్తామని అవినాష్ తరపు న్యాయవాదులకు హైకోర్టు తెలిపింది. అదీకూడా గురువారం సాయంత్రం ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతామని పేర్కొంది. దీంతో అవినాష్ బెయిల్ పిటిషన్‌పై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. 
 
బుధవారం కోర్టు ప్రారంభంకాగానే అవినాష్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరపాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, బుధవారం విచారణ జరిపే కేసుల జాబితాలో లేదని అందువల్ల విచారణ చేపట్టలేమని న్యాయమూర్తి చెప్పారు. గురువారం విచారణ చేపట్టాలని న్యాయవాది కోరగా, అందుకు కోర్టు సమ్మతించింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు కేసు విచారణ చేపడుతామని తెలిపింది. 
 
కాగా, అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్, ఆయనకు అనుకూలంగా జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. హైకోర్టు ఆదేశాలను తీవ్రంగా తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments