త్వరలో రాజీవ్ గాంధీ పార్క్ సంద‌ర్శ‌కుల‌కు అనుమ‌తి

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (15:44 IST)
సెప్టెంబ‌ర్ నెల నుంచి విజ‌య‌వాడ‌లోని రాజీవ్ గాంధీ పార్కులో సందర్శకులకు అనుమతి ఇస్తామ‌ని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ చెప్పారు. అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి ప‌నుల‌ను వేగవంతం చేసి పూర్తి చేయాల‌ని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ అధికారుల‌ను అదేశించారు. శ‌నివారం క‌మిష‌న‌ర్ అధికారుల‌తో క‌లిసి రాజీవ్ పార్క్ నందు చేపట్టిన సివిల్, గ్రీనరి అభివృద్ధి వ‌ర్క్ ప‌నుల పురోగతిని ప‌రిశీలించారు. పార్కును పూర్తిగా ప‌చ్చ‌ద‌నంతో నింపాల‌న్నారు. చిన్నారుల కోసం మ‌ల్టీ ప్టే గ్రేమ్స్ ఏర్పాటు చేయాల‌న్నారు.
 
చిన్నారుల‌కు అందుబాటులో ఉండేలా పిల్ల‌ల పార్క్ నిర్మాణం జ‌ర‌గాల‌న్నారు.  బ్రిడ్జి మ‌రమ్మ‌తులు, పార్క్‌లో వాకింగ్ ట్రాక్‌తో పాలు గెజిబో నిర్మాణం పనులు పూర్తి చేయాల‌న్నారు. ప‌ర్యాట‌కుల‌కు, సంద‌ర్శ‌కుల‌కు ఎటు చూసినా ప‌చ్చ‌ద‌నంతో క‌నువిందు చేసే విధంగా పార్క్ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు పూర్తి చేయాల‌న్నారు.

ఎమ్యూజ్ మెంట్‌ పార్కులో ఉండే విధంగా ఓపెన్ ఎయిర్‌ ధియోట‌ర్‌తో కూడి మ్యూజిక్ ఫౌంటెన్ నకు మరమ్మతులు నిర్వహించి వినియోగంలోనికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. 
పర్యటనలో సూపరింటెండింగ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్స్) వై.వి. కోటేశ్వరరావు, ఉద్యానవన శాఖాదికారి జె.జ్యోతి,ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments