Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతల ఒత్తిడి తట్టుకోలేనంటూ గ్రామ సచివాలయ ఉద్యోగిని సూసైడ్

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (11:15 IST)
అనంతపురం జిల్లాలో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. అధికార పార్టీకి చెందిన నేతల ఒత్తిడిని తట్టుకోలేక గ్రామసచివాలయ ఉద్యోగిని చనిపోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కణేకల్లు గ్రామంలో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని హిందూపురం పట్టణానికి చెందిన కాలప్ప, పద్మల ఏకైక కుమార్తె నందిని, గత యేడాది సెప్టెంబరు నెలలో సచివాలయ ఉద్యోగినిగా ఎంపికైంది. ఆమెకు కణేకల్లు 4వ సచివాలయం కార్యదర్శిగా ఉద్యోగం రాగా, తన సహచరులు లలిత, శాంతి, వరలక్ష్మితో కలిసి ఓ అద్దెగదిలో ఉంటూ ఉద్యోగానికి వెళ్లివచ్చేది. 
 
ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం బాగాలేకపోగా, 20 రోజులు సెలువు పెట్టి, అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆపై శ్రీకాళహస్తిలో ఉద్యోగులకు శిక్షణ ఇస్తుండటంతో, నాలుగు రోజుల క్రితం అక్కడికి వెళ్లి, తిరిగి కణేకల్లు చేరుకుంది. స్నేహితురాళ్లతో బాగానే ఉన్న ఆమె, నిన్న మిగతావాళ్లు ఇంట్లో లేని సమయంలో ఉరేసుకుంది. 
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా, ఆమె ఉరేసుకున్న గదిని తనిఖీ చేయగా, అక్కడ ఓ నోటుబుక్‌లో రాసిపెట్టిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పని ఒత్తిడి పెరగడం, ఆరోగ్యం సహకరించక పోవడంతో బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments