Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళపై విచక్షణారహితంగా దాడి.. ఎంత వేడుకున్నా...?

మహిళపై విచక్షణారహితంగా దాడి..  ఎంత వేడుకున్నా...?
, ఆదివారం, 15 డిశెంబరు 2019 (16:54 IST)
అనంతపురం జిల్లా హిందూపురం మండలంలోని మనే సముద్రం గ్రామంలో శనివారం రాత్రి లక్ష్మీదేవి అనే మహిళతో అదే గ్రామానికి చెందిన యువకులు సురేష్, శ్రీధర్‌లు విచక్షణారహితంగా దాడి చేశారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది ఆమె చనిపోతానని వేడుకొంటున్న వదలకుండా కాళ్లు చేతులతో కొట్టడమే గాక చంపడానికి గొంతునులిమి ప్రయత్నించడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది.
 
ఆమె కుమారుడు మా అమ్మను వదలాలని వేడుకుంటున్న వదలకుండా మహిళల అని  కూడా చూడకుండా దాడి చేయడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. గుర్తించిన స్థానికులు వెంటనే ఆమెను హిందూపురం ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం అనంతపురం అక్కడ నుంచి కర్నూలుకు తరలించారు. అయితే వారు  దాడి చేస్తున్న దృశ్యాలను అక్కడ ఉన్నవారు వీడియో తీయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ అయింది.
 
దీన్ని గుర్తించిన హిందూపురం పోలీసులు దాడి చేసి ఇద్దర్ని స్టేషన్ తరలించి విచారిస్తున్నట్లు సిఐ శ్రీనివాసులు తెలిపారు. అయితే సురేష్, శ్రీధర్‌లు గతంలో లక్ష్మీదేవి ఇంటిలో అద్దెకు ఉన్నారు. అప్పట్లో వారు మట్కా నిర్వహిస్తున్నారని తెలిసి పోలీసులు వారికి ఇల్లు ఇస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించడంతో, సురేష్, శ్రీధర్, ఇల్లు ఇవ్వను అని చెప్పడంతో ఆమెపై కక్ష పెంచుకున్నారు. 
 
మా డబ్బులు పది లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారని వారు పోలీసులుకు ఆమెపై స్టేషన్లో పిర్యాదు చేసారు. కానీ అప్పట్లో మట్కా వ్యవహరం బయటకు వస్తుందని రాజీ అయ్యారు. 
అప్పటునుంచి ఆమె పగ పెంచుకొని శనివారం రాత్రి దాడికి పాల్పడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మృతదేహాలకు ఎంబాల్మింగ్ ఇంజెక్షన్లు.. భారీగా ఖర్చు