'ఛలో సీఎంవో'కు అనుమతి లేదు... ఎవరూ రావొద్దు : సీపీ టాటా

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (15:54 IST)
సీపీఎస్ రద్దుపై గతంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలన్న డిమాండ్‌తో యూటీఎఫ్‌ సోమవారం చేపట్టదలచిన ఛలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, "ఛలో సీఎంవో" కార్యక్రమానికి అనుమతి లేదని చెప్పారు. అందువల్ల అనుమతి లేని కార్యక్రమంలో ఉద్యోగులు ఎవ్వరూ పాల్గొనరాదని చెప్పారు. ఒకవేళ పాల్గొంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పైగా, విజయవాడలో 144 సెక్షన్‌తో పాటు పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉందని, ఈ విషయాన్ని ప్రతి ఉద్యోగి గమనించాలని ఆయన కోరారు. 
 
మరోవైపు, పోలీసులు, ప్రభుత్వం కలిసి అడ్డుకున్నప్పటికీ తాము నిర్వహించలదలచిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామని యూటీఎఫ్ నాయకులు అంటున్నారు. మరోవైపు, ఛలో విజయవాడ కోసం వెళుతున్న యూటీఎఫ్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments