Webdunia - Bharat's app for daily news and videos

Install App

వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు!!

ఠాగూర్
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (16:09 IST)
గన్నవరంలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయి జైలులో ఉన్న వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. వంశీని పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ మూడు రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని ఆదేశించింది. 
 
విజయవాడ పరిధిలోనే కస్టడీలోకి తీసుకుని విచారించాలంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణ సమయంలో న్యాయవాదిని కూడా అనుమతించాలని సూచించింది. అయితే, వెన్ను సమస్య ఉందని, ఈ కారణంగా ఇబ్బందిపడుతున్నట్టు వంశీ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆయనకు జైలులో బెడ్ అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. 
 
మరోవైపు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ దర్యాప్తులో వేగం పెంచింది. ఇప్పటికే వంశీపై పీటీ వారెంట్ జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇందుకోసం ఈ నెల 25వ తేదీన కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే, వంశీని కోర్టుకు నేరుగా తీసుకొస్తారా లేదా అన్నది జడ్జి నిర్ణయం మేరకు ఉంటుందని పోలీసులు చెప్పారు. వర్చువల్‌గా అని అంటే జైలు వద్దే వర్చువల్‌గా హాజరుపరిచి, అక్కడ నుంచే నేరుగా కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments