Webdunia - Bharat's app for daily news and videos

Install App

వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు!!

ఠాగూర్
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (16:09 IST)
గన్నవరంలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయి జైలులో ఉన్న వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. వంశీని పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ మూడు రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని ఆదేశించింది. 
 
విజయవాడ పరిధిలోనే కస్టడీలోకి తీసుకుని విచారించాలంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణ సమయంలో న్యాయవాదిని కూడా అనుమతించాలని సూచించింది. అయితే, వెన్ను సమస్య ఉందని, ఈ కారణంగా ఇబ్బందిపడుతున్నట్టు వంశీ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆయనకు జైలులో బెడ్ అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. 
 
మరోవైపు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ దర్యాప్తులో వేగం పెంచింది. ఇప్పటికే వంశీపై పీటీ వారెంట్ జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇందుకోసం ఈ నెల 25వ తేదీన కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే, వంశీని కోర్టుకు నేరుగా తీసుకొస్తారా లేదా అన్నది జడ్జి నిర్ణయం మేరకు ఉంటుందని పోలీసులు చెప్పారు. వర్చువల్‌గా అని అంటే జైలు వద్దే వర్చువల్‌గా హాజరుపరిచి, అక్కడ నుంచే నేరుగా కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments