Webdunia - Bharat's app for daily news and videos

Install App

వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు!!

ఠాగూర్
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (16:09 IST)
గన్నవరంలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయి జైలులో ఉన్న వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. వంశీని పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ మూడు రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని ఆదేశించింది. 
 
విజయవాడ పరిధిలోనే కస్టడీలోకి తీసుకుని విచారించాలంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణ సమయంలో న్యాయవాదిని కూడా అనుమతించాలని సూచించింది. అయితే, వెన్ను సమస్య ఉందని, ఈ కారణంగా ఇబ్బందిపడుతున్నట్టు వంశీ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆయనకు జైలులో బెడ్ అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. 
 
మరోవైపు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ దర్యాప్తులో వేగం పెంచింది. ఇప్పటికే వంశీపై పీటీ వారెంట్ జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇందుకోసం ఈ నెల 25వ తేదీన కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే, వంశీని కోర్టుకు నేరుగా తీసుకొస్తారా లేదా అన్నది జడ్జి నిర్ణయం మేరకు ఉంటుందని పోలీసులు చెప్పారు. వర్చువల్‌గా అని అంటే జైలు వద్దే వర్చువల్‌గా హాజరుపరిచి, అక్కడ నుంచే నేరుగా కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments