Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాభిపై దాడి.. ఇంటికి చేరుకుని పరామర్శించిన చంద్రబాబు

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (13:24 IST)
తెలుగు దేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై మంగళవారం ఉదయం కొంద‌రు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో పట్టాభి గాయపడగా, ఆయన కారు పూర్తిగా ధ్వంసమైంది. 
 
ఈ ఘ‌ట‌న గురించి తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. విజ‌య‌వాడ‌లోని గురునాన‌క్ న‌గ‌ర్‌లో ఉన్న‌ ప‌ట్టాభి ఇంటికి చేరుకున్నారు. ప‌ట్టాభిని ప‌రామ‌ర్శించి, ఆయ‌నకు త‌గిలిన గాయాల‌ను ప‌రిశీలించారు.
 
త‌న‌పై జ‌రిగిన దాడి గురించి చంద్ర‌బాబుకు ప‌ట్టాభి వివ‌రించి చెప్పారు. ఆ స‌మ‌యంలో ప‌ట్టాభి మంచంపైనే ప‌డుకుని ఉన్నారు. ప‌ట్టాభి ఇంటికి  దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు, బోండా ఉమా మ‌హేశ్వర‌రావుతో పాటు ప‌లువురు టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కూడా భారీగా చేరుకుంటున్నారు. 
 
కాగా, తనపై జరిగిన దాడి గురించి పట్టాభి మాట్లాడుతూ, సుమారుగా 15 మంది వచ్చి తనపై, తన వాహనంపై దాడి చేశారని చెప్పారు. రాడ్లు, కర్రలు, బండ రాళ్లతో దాడి చేశారన్నారు. 10 రోజులుగా తనకు బెదిరింపులు వస్తున్నాయని, ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నాననే తనపై దాడి చేశారని తెలిపారు. 
 
తనను హత్య చేయాలనే పథకం ప్రకారం దాడి చేశారని, ఎన్ని దాడులు చేసినా తన గొంతు నొక్కలేరని స్పష్టం చేశారు. ప్రాణాలు పోతున్నా డీజీపీ పట్టించుకోరా? అని ప్రశ్నించారు. డీజీపీ వచ్చి న్యాయం చేస్తామని‌ తనకు హామీ ఇవ్వాలని పట్టాభి డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments