Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేత విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి.. ఏంటదో తెలుసా?

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (13:35 IST)
vijayasai reddy
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి లభించింది. వైకాపాకు రాజ్యసభలో బలం పెరగడంతో.. కీలకమైన బీఏసీలో చోటు లభించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది వైసీపీ. దీంతో సభలో బిజినెస్‌ అడ్వైజరీ కమిటీలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు దక్కింది. 
 
రాజ్యసభ కార్యక్రమాల నిర్వహణలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ కీలకపాత్ర పోషిస్తుంది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో.. వైసీపీ నుంచి కొత్తగా నలుగురు సభ్యులు ఎన్నికయ్యారు. దీంతో.. రాజ్యసభలో వైసీపీ బలం రెండు నుంచి ఆరుకు పెరిగింది. ప్రస్తుతం.. విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.
 
బీసీఏ సభ్యులుగా ప్రొఫెసర్‌ మనోజ్‌ కుమార్‌ ఝా, మల్లికార్జున్‌ ఖర్గే, శివ్‌ ప్రతాప్‌ శుక్లాలను నామినేట్ చేశారు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు. ఇక, సబార్డినేట్‌ లెజిస్లేచర్‌ కమిటీ సభ్యులుగా జీవీఎల్‌ నరసింహారావు, కె.ఆర్‌.సురేష్‌రెడ్డి నియమితులయ్యారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments