Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్ల మార్కెట్‌కు వంట నూనెలలు - మండిపోతున్న ధరలు

Andhra Pradesh
Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (13:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి కారణం వంట నూనెలను వ్యాపారులు, దళారులు నల్ల మార్కెట్‌కు తరలించి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. దీంతో వీటి ధరలు ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ధరలను చూసిన వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ అధికారుల్లో ఏమాత్రం చలనం కనిపించడం లేదు. 
 
ఈ ధరల పెంపునకు ఉక్రెయిన్ రష్యా దేశాల మధ్య సాగుతున్న యుద్ధాన్ని ఓ కారణంగా చెబుతున్నారు. అలాగే, దేశ వ్యాప్తంగా వంట నూనెల కొరత ఉందని వ్యాపారాలు ఆరోపిస్తున్నారు. దీంతో వంట నూనెల ధరలను ఇష్టానుసారంగా పెంచేసిన వ్యాపారులు వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. తిరుపతిలోని పలు దుకాణామాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అధిక ధరలకు వంట నూనెలను విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. 
 
కాగా, నల్ల వ్యాపారానికి పాల్పడుతున్న దుకాణాల యజమానులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా నూనెల ప్యాకెట్ల నిల్వ, నూనె ప్యాకెట్లపై అధిక రేట్లతో స్టిక్కర్లు అంటించి విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కొనుగోలుదారులు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments