Webdunia - Bharat's app for daily news and videos

Install App

గన్నవరం చేరిన ఉప రాష్ట్రపతి వెంకయ్య... ఏపీ గ‌వ‌ర్న‌ర్ స్వాగ‌తం

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (14:36 IST)
రాష్ట్రంలో నాలుగు రోజుల పర్యటన సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు శనివారం ఉదయం గన్నవరం చేరుకున్నారు. గోవా నుండి ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో శనివారం ఉదయం 11.08 ని.లకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు.  ఉప రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శాలువా కప్పి, పుష్ప గుచ్చం అందించి  ఘనంగా స్వాగతం పలికారు. 

 
గ‌వ‌ర్న‌ర్ కు స్వాగతం పలికిన వారిలో రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, డిజిపి గౌతం సవాంగ్, రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి రేవు ముత్యాలరాజు, విజయవాడ నగర పోలీస్ కమీషనర్  బి . శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ జె. నివాస్, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్య రెడ్డి, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్, త‌దిత‌రులు వున్నారు. 

 
అనంతరం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గన్నవరం నుండి బయలుదేరి ఉంగుటూరు మండలం ఆత్కూరు లోని స్వర్ణభారతి ట్రస్ట్ కు బయలుదేరి వెళ్లారు. అక్క‌డ ఉప‌రాష్ట్ర‌ప‌తి కుమార్తె ఆధ్వ‌ర్యంలో జరిగే స్వర్ణభారతి ట్రస్ట్ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. మ‌రో నాలుగు రోజుల పాటు ఆయ‌న విజ‌య‌వాడ‌, విశాఖ‌ల‌లో జ‌రిగే కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments