Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపరాష్ట్రపతిగా కాదు.. ఉషాపతిగానే వచ్చా.. పిచ్చిరాతలు వద్దు (వీడియో)

భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన నెల్లూరు జిల్లాకు చెందిన ముప్పవరపు వెంకయ్య నాయుడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి తొలిసారి వచ్చారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం శ్రీవారిని

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (16:01 IST)
భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన నెల్లూరు జిల్లాకు చెందిన ముప్పవరపు వెంకయ్య నాయుడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి తొలిసారి వచ్చారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. 
 
బుధవారం రాత్రే తిరుమలకు చేరుకున్న ఆయన ముందుగా ఆలయ సంప్రదాయాన్ని పాటిస్తూ స్వామి పుష్కరిణకి చేరుకుని పవిత్ర జలాలను ప్రోక్షణం చేసుకున్నారు. అనంతంర శ్రీవరాహస్వామివారి దర్శించుకుని వైకుంఠం-1 క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. సామాన్య భక్తులతోపాటు క్యూలైన్‌లో స్వామివారి ఆలయానికి వచ్చిన వెంకయ్య, ఆయన కుటుంబ సభ్యులకు ఆలయ అధికారుల ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికారు. 
 
శ్రీవారి దర్శనం అనంతరం అద్దాల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. తర్వాత టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, ఏఈఓ శ్రీనివాసరాజులు తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. వెంకయ్య నాయుడి వెంట ఏపీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న కూడా ఉన్నారు.
 
దర్శనానంతరం వెంకయ్య మాట్లాడుతూ, దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. మరింత పట్టుదలతో కర్తవ్య నిర్వహణ చేయాలని భగవంతుడిని ప్రార్థించినట్టు చెప్పారు. మకర సంక్రాంతి మనందరి జీవితాల్లో నవ్యక్రాంతిని తీసుకురావాలి... మరింత శక్తిమంతమైన దేశంగా భారత్ ఎదగాలని ఆకాక్షించినట్టు చెప్పారు. 
 
కాగా, భారత ఉపరాష్ట్రపతికి ఆలయ మహద్వార ప్రవేశం ఉన్నప్పటికీ సామాన్య భక్తులి మాదిరిగా లోనికి ప్రవేశించారు. దీనిపై కూడా వెంకయ్య నాయుడు వివరణ ఇచ్చారు. శ్రీవారి దర్శనానికి తాను ఒక్కడినే రాలేదనీ, కుటుంబ సభ్యులందరితో కలిసి వచ్చాననీ, అందువల్లే సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ విషయంపై రాద్దాంతం చేయొద్దనీ మీడియాకు ఆయన విజ్ఞప్తి చేశారు. వెంకయ్య శ్రీవారి దర్శన వీడియో చూడండి. 
 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments