Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరలక్ష్మీ వ్రతం గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌ర‌ణ‌

Webdunia
శనివారం, 27 జులై 2019 (21:04 IST)
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 9న జ‌రుగ‌నున్న వరలక్ష్మీ వ్రతం గోడ‌ప‌త్రిక‌ల‌ను శ‌నివారం టిటిడి తిరుప‌తి జెఈవో పి.బ‌సంత్‌కుమార్ ఆవిష్క‌రించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలోని జెఈవో కార్యాల‌యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో జెఈవో మాట్లాడుతూ... తిరుచానూరులోని ఆస్థాన మండ‌పంలో ఉద‌యం 10 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం జ‌రుగ‌నుంద‌ని తెలిపారు.

రూ.500 టికెట్ కొనుగోలు చేసి గృహ‌స్తులు(ఇద్ద‌రు) వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తంలో పాల్గొన‌వ‌చ్చ‌న్నారు. గృహ‌స్తులు సంప్ర‌దాయ వ‌స్త్రాలు ధ‌రించి పాల్గొనాల‌ని కోరారు. అదేరోజున సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడవీధులలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. వరలక్ష్మీ వ్రతం కారణంగా ఆగ‌స్టు 9న‌ ఆలయంలో అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, సహస్రదీపాలంకరణ సేవలతోపాటు ఉద‌యం, సాయంత్రం బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను రద్దు చేశామ‌ని, భక్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని జెఈవో కోరారు.

వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం టికెట్ల‌ను భ‌క్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా ఆగ‌స్టు 2న ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. వ్ర‌తానికి ఒకరోజు ముందు ఆల‌యం వ‌ద్ద గ‌ల కౌంట‌ర్‌లో టికెట్లు విక్ర‌యిస్తారు. కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, సూప‌రింటెండెంట్ ఈశ్వ‌ర‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments