Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో శాస్త్రోక్తంగా ఉట్లోత్సవం

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (21:42 IST)
శ్రీ‌ కృష్ణ‌జ‌న్మాష్ట‌మి వేడుక‌ల్లో భాగంగా తిరుమలలో శ్రీవారి ఆలయంలో ఉట్లోత్సవ ఆస్థానం  మంగళవారం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా జరిగింది. కోవిడ్ - 19  వ్యాప్తి నేపథ్యంలో ఈ వేడుకలు  ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. 
 
శ్రీవేంకటేశ్వరస్వామివారికి గోకులాష్టమి ఆస్థానం నిర్వహించిన మరునాడు ఉట్లోత్సవాన్ని(శిక్యోత్సవం) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులోభాగంగా శ్రీ మలయప్పస్వామివారిని  బంగారు తిరుచ్చిపై ప్రసాదాలు తయారు చేసే పోటు లోనికి, శ్రీ కృష్ణస్వామివారిని మరో తిరుచ్చిపై పోటు మండపంలోని కి వేంచేపు చేసి నివేదన, హారతి ఇచ్చారు.
 
అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో స్వామివార్లను వేంచేపు చేసి ఆస్థానం, నివేదన, హారతి  సమర్పించారు.
 
ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఇఓ రమేష్ బాబు, వీజీవో బాలి రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments