Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆద్యంతం వినోదం ఇచ్చే క‌థ‌కు బాణీలు చేస్తున్నాః దేవిశ్రీ ప్రసాద్

Advertiesment
Sharwanand
Devisree Prasad
శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ కావడం విశేషం. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. 
 
కాగా, ఈ సినిమా గురించి దేవీశ్రీ ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ, థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ శ‌ర్వానంద్‌. ఈ చిత్ర క‌థంతా ద‌ర్శ‌కుడు వినిపించారు. ఆద్యంతం ఉల్లాసంతోపాటు రొమాంటిక్ ఫీల్ వున్న క‌థ ఇది. ఈ సినిమాకు సంగీతం స‌మ‌కూర్చ‌డం కూడా అంతే ఆనందంగా వున్నాన‌ని పేర్కొన్నారు.
 
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న సహా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల. ఈ సినిమాలో శర్వానంద్, రష్మిక మందన్న క్యారెక్టర్లు ఆసక్తికరంగా ఉండ‌నున్నాయని, కిశోర్‌ తిరుమల మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కిన్నారని. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మంచి అసెట్ కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.
 
సినిమా టైటిల్‌ని బట్టి ఈ చిత్రంలోని ఫీమేల్‌ క్యారెక్టర్స్‌ మంచి ఇంపార్టెన్స్‌ ఉంటుందని తెలుస్తుంది. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
 జాతీయ అవార్డులు సాధించిన శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడింటింగ్‌ బాధ్యతలు నిర్వ‌హిస్తున్న‌ ఈ సినిమాకు సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రాఫర్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెబ్ సిరీస్ వ‌ల్లే బోల్డ్ కంటెంట్, చెడు డైలాగ్స్ వ‌చ్చాయిః అరుణ్ ఆదిత్