Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ బాత్రూంలో విద్యార్థిని మృతదేహం... ఏమైంది?

Webdunia
సోమవారం, 22 జులై 2019 (18:15 IST)
అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హాస్టల్‌లోని బాత్రూంలో మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖరగ్‌పూర్ నగరానికి చెందిన దీపికా మహాపాత్ర (29) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్.డి చదువుతోంది. 
 
ఈ విద్యార్థిని సోమవారం నాడు ఉదయం 8 గంటల ప్రాంతంలో బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో పడిపోయి ఉంది. తోటి విద్యార్థులు చూసి వెంటనే కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించారు. కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఆ విద్యార్థిని స్థానిక ఓ ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. 
 
అప్పటికే ఆమె చనిపోయిందని హాస్పిటల్ వర్గాలు నిర్ధారించారు. అయితే పోలీసులు అప్పటికే ఆమె మెడికల్ రికార్డులు, తోటి స్నేహితులు బంధువులను పరిశీలించి ఆమెకి మెదడుకు సంబంధించిన కొన్ని వ్యాధులు ఉన్నట్లు  పేర్కొన్నారు. ఆ వ్యాధుల వలన ఆమె కళ్ళు తిరిగి పోయి బాత్రూంలో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments