Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ అధికారులపై కేసు నమోదైంది.. వారిని సస్పెండ్ చేయాలి : ఉండి ఎమ్మెల్యే

వరుణ్
గురువారం, 18 జులై 2024 (18:30 IST)
తనపై హత్యాయత్నానికి పాల్పడిన మాజీ సీఐడీ విభాగం డీజీ సునీల్ కుమార్, విజయ్ పాల్, మాజీ ముఖ్యమంత్రి జగన్, గుంటూరు జనరల్ ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ ప్రభావతిలపై కేసు నమోదైందని తెలుగుదేశం పార్టీకి చెందిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తెలిపారు. వీరిలో సునీల్ కుమార్, విజయ్ పాల్, డాక్టర్ ప్రభావతిలను తక్షణం సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
తనపై హత్యాయత్నం చేశారని సీఎం జగన్‌, సీఐడీ అధికారులపై ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేసుకు సంబంధించి వివరాలు, పురోగతి గురించి తెలుసుకునేందుకు ఆయన గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు సీఐడీ కార్యాలయంలో తనను చంపేందుకు కుట్ర పన్నారని, మీడియా వల్లే బతికిపోయానని తెలిపారు. 
 
'నా ఫిర్యాదు మేరకు మాజీ సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌, విజయ్‌ పాల్‌, మాజీ సీఎం జగన్‌, జీజీహెచ్‌ ప్రభావతిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలు తెలుసుకోవడానికే ఎస్పీ కార్యాలయానికి వచ్చాను. నా దగ్గర ఉన్న సమాచారం అందించాను. అప్పటి కలెక్టర్‌ తీసుకున్న చర్యలు కూడా నిబంధనకు విరుద్ధంగా ఉన్నాయి. కేసు నమోదైంది కాబట్టి.. సీఐడీ అధికారుల్ని సస్పెండ్‌ చేయాలి' అని రఘురామ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments