ఆ అధికారులపై కేసు నమోదైంది.. వారిని సస్పెండ్ చేయాలి : ఉండి ఎమ్మెల్యే

వరుణ్
గురువారం, 18 జులై 2024 (18:30 IST)
తనపై హత్యాయత్నానికి పాల్పడిన మాజీ సీఐడీ విభాగం డీజీ సునీల్ కుమార్, విజయ్ పాల్, మాజీ ముఖ్యమంత్రి జగన్, గుంటూరు జనరల్ ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ ప్రభావతిలపై కేసు నమోదైందని తెలుగుదేశం పార్టీకి చెందిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తెలిపారు. వీరిలో సునీల్ కుమార్, విజయ్ పాల్, డాక్టర్ ప్రభావతిలను తక్షణం సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
తనపై హత్యాయత్నం చేశారని సీఎం జగన్‌, సీఐడీ అధికారులపై ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేసుకు సంబంధించి వివరాలు, పురోగతి గురించి తెలుసుకునేందుకు ఆయన గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు సీఐడీ కార్యాలయంలో తనను చంపేందుకు కుట్ర పన్నారని, మీడియా వల్లే బతికిపోయానని తెలిపారు. 
 
'నా ఫిర్యాదు మేరకు మాజీ సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌, విజయ్‌ పాల్‌, మాజీ సీఎం జగన్‌, జీజీహెచ్‌ ప్రభావతిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలు తెలుసుకోవడానికే ఎస్పీ కార్యాలయానికి వచ్చాను. నా దగ్గర ఉన్న సమాచారం అందించాను. అప్పటి కలెక్టర్‌ తీసుకున్న చర్యలు కూడా నిబంధనకు విరుద్ధంగా ఉన్నాయి. కేసు నమోదైంది కాబట్టి.. సీఐడీ అధికారుల్ని సస్పెండ్‌ చేయాలి' అని రఘురామ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9 బంధాలు: సెంటిమెంట్ బాగా పండుతోంది.. ఆట పడిపోతుంది.. క్రేజ్ గోవిందా

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments